Friday 15 August 2014





ఘనంగా స్వాతంత్ర్య దినోత్సవం 

15-08-2014న గొల్లనపల్లి హైస్కూల్లో స్వాతంత్ర్య దినోత్సవం ఘనంగా జరిగింది. హెచ్ ఎం మీనాక్షిదేవి అధ్యక్షతన  జరిగిన ఈ కార్యక్రమములో సర్పంచ్ మెండే జయకాంతమ్మ మువ్వన్నెల జెండా ఆవిష్కరించారు. బడి పిల్లలు మార్చ్ ఫాస్ట్ చెశారు. సర్పంచ్ మెండే జయకాంతమ్మ, ఎంపీటీసీ బర్రే పాప, యస్ ఎం సి ప్రెసిడెంట్ పి. సుధాకర్ తదితరులు సందేశాలు ఇచ్చారు. పూర్వ విధ్యార్ధి సీహెచ్  పూర్ణచంద్రరావు  (అమెరికా) ఈ ఏడాదీ పదవ తరగతిలో మొదటి.. రెండవ.. మూడవ స్థానాలు వచ్చిన పిల్లలకు నగదు చెక్కులు అందచేశారు. గన్నవరము బార్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు శీలం వెంకట సాం బంశివరావు తన తండ్రి మాధవరావును స్మరించుకుంటూ అయిదు వేల రూపాయల విలువ చెసే 100 మధ్యానపు భొజన పళ్ళాలను బహూకరించారు. హెచ్ ఎం మీనాక్షిదేవి దాతలను అభినందించారు. కార్యక్రమములో ఉపాధ్యాయులు రాంబాబు మాస్టారు.. రవి.. నాగభూషనం.. డాక్టర్ భాగవతుల హేమలత.. తదితర ఉపాధ్యాయులు.. గ్రామస్తులు పాల్గొనారు.  


No comments: